![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 02:53 PM
కోలీవుడ్ స్టార్ నటుడు మరియు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తన రాబోయే తమిళ ప్రాజెక్టు కోసం ఓహ్ మై కడవులే దర్శకుడు అశ్వత్ మారిముతుతో జత కట్టారు. 'డ్రాగన్' పేరుతో వస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ టైటిల్ కి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అని లాక్ చేశారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరియు కయాదు లోహర్ మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తెలుగు మరియు తమిళ వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రేండింగ్ 3 పోసిషన్ లో ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు మైస్కిన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ క్రింద నిర్మించబడుతుంది. లియోన్ జేమ్స్ ఈ చిత్ర సంగీత స్వరకర్త.
Latest News