![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 03:14 PM
ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారిలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది.టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి అలరించింది ఈ వయ్యారి భామ. తెలుగుతో పాటే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది.ఆ మధ్య పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరి పెళ్లి గత ఏడాది ఫిబ్రవరి 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భారీగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ చిన్నది సినిమాలు తగ్గించింది. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.