![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 02:55 PM
నిధీ అగర్వాల్ మంచి ఫామ్లో ఉన్నారు. సక్సెస్లు లేకపోయినా అవకాశాలు మాత్రం బాగానే వరిస్తున్నాయి. ఇప్పటికే ఆమె రెండు భారీ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటిస్తోంది. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజాసాబ్’తో ఈ ఏడాది ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన అప్కమింగ్ సినిమాల గురించి మాట్లాడారు. 2022లో గ్యాప్ తీసుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ‘హరిహర వీరమల్లు' లో నా పాత్ర ఇప్పటివరకు నేను చేసిన వాటిల్లో అత్యుత్తమమైనది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. కథక్ నేర్చుకున్నాను. నా కల నిజమైంది. అదృష్టవంతురాలిని అని అనిపించింది. అలాగే హర్రర్ సినిమాలంటే గతంలో భయం ఉండేది. అందుకే ‘ది రాజా సాబ్’ చేయాలనుకున్నాను. సెట్లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా అందరం నవ్వుతూనే ఉన్నాం’’ అని అన్నారు. సెట్లో విషయానికొస్తే.. పవన్ కల్యాణ్, ప్రభాస్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. పవన్ సెట్స్లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్ చెప్పగానే పూర్తిగా పాత్రలోకి వెళ్లిపోతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఆ సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారు. ఈ లక్షణాన్ని నేను కూడా అలవాటు చేసుకోవాలి. ప్రభాస్ ఫన్నీ పర్సన్. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాయా అని ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు.
Latest News