|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 11:49 AM
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రణాళికలో ఎల్బీనగర్,అరాంఘర్, మోహిదీపట్నం, బీహెచ్ఈఎల్ మార్గాల్లో మెట్రో నిర్మాస్తామని హామీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై సమీక్ష చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. నగరంలో మౌలిక వసతులు, చేపట్టాల్సిన పనులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్యేల స్థూల నెలసరి జీతం ఏకంగా 163 శాతం పెరిగింది. వివరాలు ఇలా..
* ఒక ఎమ్మెల్యే నెల జీతం రూ.2.50 లక్షలు. ఇందులో అసలు వేతనం రూ.20 వేలు కాగా.. నియోజకవర్గ అలవెన్స్లు రూ.2.30 లక్షలు ఉంటుంది.
* అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినప్పుడు రోజుకు రూ.1000 చెల్లిస్తారు.
* ముఖ్యమంత్రి వేతనం రూ.4.21 లక్షలు(ప్రస్తుతం సీఎంగా రేవంత్ ఉన్నారు)
* శాసన సభాపతి వేతనం రూ.4.11 లక్షలు
* మంత్రులు, చీఫ్ విప్, విప్ల వేతనం రూ.4 లక్షలు