![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 09:57 PM
పీహెచ్డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
ఓయూ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరీ 2 పరీక్షలకు రూ. 2000 అపరాధ రుసుముతో ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చేనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.