|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 02:04 PM
వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. గత నెలలో లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే.ఆ కేసు విచారణలో భాగంగా అధికారులు ఆయనను ప్రశ్నించగా, భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంచిరేవులలోని ఆయన ఇంట్లోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హనుమకొండ అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓ ప్రైవేట్ పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం సుమారు రూ.60 వేలు లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. అప్పట్లో ఆయన నివాసంలో జరిగిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.