|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:36 PM
భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్ ఆల్ మర్రీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందాన్ని కలిశారు.ఈ సందర్భంగా మంత్రి మర్రీ మాట్లాడుతూ, తెలంగాణతో కలిసి పనిచేయడానికి సంతోషంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి రెండు ప్రభుత్వాలు అధికారులతో ఒక ఉమ్మడి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతినిధి బృందం భారత్ ఫ్యూచర్ సిటీలో సహకారానికి గల అవకాశాలపై చర్చించింది.