|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 01:59 PM
బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిల్లాపరిషత్ హై స్కూల్ లో మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగో వార్డ్ నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి నీలం కవిత, తన కూతుర్లు సింధుజ, కీర్తి తో కలసి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు స్వచ్ఛధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే తగిన ఆయుధమని ప్రతి ఒక్కరు ఓటు వేసి తమ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.