by Suryaa Desk | Fri, Jul 12, 2024, 03:54 PM
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకే కొత్త బస్సులు ప్రారంభించినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ లో నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం నుండి అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలిపారు.