by Suryaa Desk | Fri, Jul 12, 2024, 03:48 PM
కల్వకుర్తి మండలం మార్చల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న బాలురు మరుగుదొడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ తలసాని రు లక్ష్మారెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన కుమార్తె, అల్లుడు మరుగుదొడ్ల నిర్మాణానికి 30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వాటి పూర్తి నిర్మాణానికి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు ఉన్నారు.