by Suryaa Desk | Fri, Jul 12, 2024, 03:46 PM
కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు, రైతు భరోసా పథకం అమలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అమరచింత మండలం కొంకనోనిపల్లి గ్రామంలో శుక్రవారం కౌలు రైతుల సర్వే చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో బ్యాంకుల సర్వే ప్రకారం 24లక్షల మంది కౌలు రైతులు 35 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సూచించారు.