by Suryaa Desk | Fri, Jul 12, 2024, 03:44 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ ఆశా కార్యకర్త చింతకుంట్ల లక్ష్మమ్మ, అంగన్వాడి ఉపాధ్యాయురాలు కె. లలిత పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని నీటితొట్లు, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా, దోమలు విస్తరించకుండా ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు.