by Suryaa Desk | Fri, Jul 12, 2024, 03:43 PM
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని ఆల్- హాస్నథ్ కాలనీలో దోమల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్ నసీరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షపు నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారి చేయాలన్నారు. లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలన్నారు.