by Suryaa Desk | Fri, Jul 12, 2024, 04:01 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సచివాలయంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ సరిత తిరుపతయ్య, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవితో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించడం జరిగింది. పలు గద్వాల అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించి వినతి పత్రం అందజేసినారు.