by Suryaa Desk | Fri, Jul 12, 2024, 04:04 PM
దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో శుక్రవారం అమ్మ ఆదర్శ కమిటీ చేపట్టిన మైనర్ వర్క్, డ్రింకింగ్ వాటర్, బాత్ రూమ్స్ పనులను పరిశీలించారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. గ్రామంలోని నర్సరిని, మొక్కల ప్లాంటేషన్ ను సందర్శించారు.