by Suryaa Desk | Fri, Jul 12, 2024, 03:40 PM
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వనపర్తి పర్యటనలో భాగంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయికుమార్, అమరచింత, ఆత్మకూరు మండలాల కన్వీనర్ అఖిల్ ను శుక్రవారం ఉదయం అక్రమంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రశ్నించే గొంతులను అణిచి వేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు.