by Suryaa Desk | Fri, Jul 12, 2024, 03:40 PM
వైద్యులు అందుబాటులో ఉండి. సేవలందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేటలోని సీ. హెచ్. సీని శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ఐపీ, లేబర్ రూం, ఫార్మసీ, ల్యాబ్, టాయిలెట్స్, ప్రహరీ, జనరేటర్, డ్రైనేజీ పరిశీలించి, వైద్యులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కేసులు, వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.