by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:03 PM
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు స్పీడప్ చేసింది. శుక్రవారం రాజేంద్రనగర్ MLA ప్రకాష్గౌడ్ కాంగ్రెస్లో చేరితే, శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అధికారపార్టీకి జై కొట్టారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు.ఆయనతో పాటు పలువురు కార్పోరేటర్లు, స్థానిక నాయకులు, అనుచరులు కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్రెడ్డి తనకు పాత మిత్రుడే అన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ముఖ్యమంత్రే స్వయంగా తనను కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు చెప్పుకొచ్చారు. అన్నీ ఆలోచించిన తర్వాత… కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సూచన మేరకు కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు అరికెపూడి.