by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:24 PM
రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి బియ్యం కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేసి డీలర్ షిప్ రద్దు చేస్తామని సివిల్ సప్లై డిటి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శనివారం దేవరకొండలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రమేష్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి చారకొండకు తరలిస్తున్నట్లు డిటి తెలిపారు. కార్డుదారులు బియ్యాన్ని విక్రయిస్తే కార్డులు రద్దు చేస్తామన్నారు.