by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:30 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏఐటీయుసీ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. జీఓ 60 అమలు లేదా కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని కోరారు. నెలకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, వారాంతపు సెలవు అమలు చేయటం లేదన్నారు. ప్రమాద భీమా రూ. 25 లక్షలు ఇవ్వాలన్నారు.