by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:46 PM
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జంగమయ్యపల్లికి చెందిన వరలక్ష్మికి పురిటి నొప్పులు రాగా 108కి సమాచారం అందించారు. శనివారం కడుకుంట్ల నుండి అంబులెన్స్ లో ఆమెను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో నొప్పులు అధికమయ్యాయి. ఆమె 108లో నార్మల్ డెలివరీ కాగా, మగబిడ్డ జన్మించినట్లు 108టెక్నీషియన్ నరేందర్, పైలట్ రాఘవేంద్ర తెలిపారు. తల్లిబిడ్డను వనపర్తి ఆసుపత్రిలో చేర్చినట్లు సిబ్బంది తెలిపారు.