by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:47 PM
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి రజిత చెప్పారు. శుక్రవారం భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నీటి నిల్వ ఉంచిన టైర్లు, గుంతలు, కొబ్బరి చిప్పలను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.