by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:49 PM
భిక్కనూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేసేందుకు తరలి వెళ్లారు. కాచాపూర్ గ్రామానికి చెందిన లింగాల పుష్ప కిష్టగౌడ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు అక్కడికి వెళ్లారు. పది రోజుల పాటు తిరుమల తిరుపతిలో పలు విభాగాలలో వారు పని చేయనున్నారు. పుష్ప మాట్లాడుతూ, తితిదేలో సేవ చేసే భాగ్యం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని వేడుకున్నారు.