by Suryaa Desk | Thu, Oct 03, 2024, 11:49 AM
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన హైకోర్టు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టులో ఎదురుదెబ్బ. BRS నుండి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరణ .సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్ట్ డివిజన్ బెంచ్. ఈనెల 24న వాదనలు వింటామన్న డివిజన్ బెంచ్. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు. షెడ్యూల్ ఖరారు చేయాలని ఉత్తర్వులు వెలువరించిన హైకోర్ట్. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి . దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని.. గతంలో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్