by Suryaa Desk | Thu, Oct 03, 2024, 02:56 PM
కరీంనగర్ జిల్లా కేంద్రం లో ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన లోయర్ మానేరు డ్యాం లో 100 శాతం సబ్సిడీ తో చేప పిల్లల విడుదల కార్యక్రమంకి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక ఆలా,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మత్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్,కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నేత వెలిచాల రాజేందర్ రావు , కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ ,హుజురాబాద్ ఇన్చార్జి వొడితల ప్రణవ్, కార్పొరేటర్లు ,పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. లోయర్ మానేరు డ్యాం లో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేయడం జరిగింది