by Suryaa Desk | Thu, Oct 03, 2024, 12:45 PM
ఇద్దరు గంజాయి విక్రేతలను మీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనవనంకు చెందిన ఆటో డ్రైవర్ మనీష్ సింగ్, కూలీ పనులు చేసే మహమ్మద్ ఖలీల్ లు కొంతకాలంగా మంగళ్ హాట్ సీతారాం పేటకు చెందిన ఆబేద్ బినాఖాలిద్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి, స్థానికంగా విక్రయిస్తున్నారు. గురువారం గాయత్రినగర్ వద్ద వారిని అరెస్ట్ చేసి, 1300 గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.