![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 03:29 PM
కేసీఆర్ తెలంగాణను నిలబడితే, రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్ రావు పేర్కొన్నారు. జీఎస్టీ వాటా తగ్గిందంటే అందుకు కారణం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన అంతా సగం సగం ఆగం ఆగం అని విమర్శించారు.ఆనాడు ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పారు... ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు అని హరీశ్ రావు మండిపడ్డారు.యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి పనితీరు గురించి చెప్పాలంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అని విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు.