|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:35 PM
TG: మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం తన ఇంటిని తనఖా పెట్టారు. విద్యార్థిని మమత చదువు కోసం ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాలని కళాశాల తెలిపింది. ఏదైనా ఆస్తి తనఖా పెడితేనే రుణం ఇస్తామని బ్యాంకర్లు చెప్పారు. విద్యార్థిని తండ్రి రామచంద్రం ఈ విషయాన్ని హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఇంటిని తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అలాగే హాస్టల్ ఫీజు కోసం రూ.లక్ష సహాయం చేశారు.