|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 02:14 PM
గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్కు BRS MLC కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయని లేఖలో పేర్కొన్నారు. 'ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైంది. నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించింది. గ్రూప్ -1 నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయి' అని తెలిపారు.