|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 02:17 PM
ప్రభుత్వ ఉద్యోగిని కొట్టిన బీజేపీ కార్పొరేటర్ . జీహెచ్ఎంసీ సర్కిల్ 14లో సెక్షన్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్. ఉద్యోగులపై చేయి చేసుకోవడంతో విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు. ఒక ప్రభుత్వం అధికారులపై కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని నిలదిస్తున్న సదరు ఉద్యోగులు. సర్కిల్ 14కి తాళం వేసి ఆందోళన చేస్తున్న ఉద్యోగులు.. అయితే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ కార్పొరేటర్ పై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని చెప్పారు.