by Suryaa Desk | Fri, Jul 12, 2024, 11:02 AM
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గుర్నాథ్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర జైళ్ల శాఖ ఐజి మిశ్రా హైదరాబాదులో గురువారం గుర్నాథ్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయన అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.