by Suryaa Desk | Fri, Jul 12, 2024, 02:27 PM
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్లో నెలకొన్న సమస్యలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులపై ఆమ్రపాలితో ఎమ్మెల్యే చర్చించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమెను కోరారు.