by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:42 PM
రైతులు ఐటీ రిటర్న్ లు దాఖలు చేస్తే రైతు భరోసా రాదేమోనని భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రైతు భరోసా అమలుపై వనపర్తిలో సమీక్ష సమావేశ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ. రుణమాఫీని ఆగస్టులో చేస్తాం. దీని వల్ల పెట్టుబడి సాయం కొంచెం ఆలస్యం కావొచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే రూ. 10 వేల వరకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.