by Suryaa Desk | Sat, Jul 13, 2024, 03:27 PM
పాఠశాల స్థాయి నుంచే పుస్తక పఠనాన్ని అలవర్చుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సబితారెడ్డి సూచించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఆమెజాన్ సంస్థ మండలంలోని నేదునూరులో నిర్మించిన అంగన్వాడీ భవనం, కొత్తూర్ నిర్మించిన గ్రంథాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కొత్తగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.