by Suryaa Desk | Wed, Sep 11, 2024, 03:29 PM
మల్యాల మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జగిత్యాల ఆర్.డి.ఓ తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పిల్లలకు కల్పిస్తున్న వసతులను , విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నార లేదా అని విద్యార్థులతొ పాటు క్లాస్ రూమ్ లో కూర్చుని టీచర్ బోధనను , విద్యార్థులు మన్నన చేసుకునే విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. అనంతరం రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల ఆవరణ, చుట్టూ ప్రసారాలను పరిశీలించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పోలింగ్ సెంటర్ గా ఏర్పాటు చేయుటకు తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయానవెంట ఆర్.డి.ఓ మధు సుధన్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, తహసీల్దార్ , ఎంపిడిఓ, విద్యాధికారులు, , తదితరులు పాల్గొన్నారు.