|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:13 PM
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ జ్వాల ట్వీట్ చేశారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా విప్లవాత్మక చర్యగా మారనుంది. ట్రాన్స్జెండర్ల నియామకం ద్వారా... వారిని కలుపుకొనిపోవడమే కాకుండా మన సమాజంలో వారికి అధికారిక గుర్తింపును కూడా అందించింది. ఈ చర్య మన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల మార్పునకు శ్రీకారం చుడుతుంది" అని గుత్తా జ్వాలా పేర్కొన్నారు.