|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 02:36 PM
పూణేలోని వాఘోలి ప్రాంతంలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పిండి మిల్లులో పనిచేసే 27 ఏళ్ల వ్యక్తి 4వ తరగతి చదువుతున్న బాలికకు చాక్లెట్లు ఇస్తానని ప్రలోభపెట్టి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక ఉదయం 9 గంటలకు స్కూల్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పాప ఏడుపు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.