![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 01:11 PM
కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు.
పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.