![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 08:34 PM
2013లో దిల్సుఖ్నగర్లో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా 2016లో యాసిన్ భత్కల్ సహా మరో ఐదుగురికి ఎస్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ముద్దాయిలు కిందిస్థాయి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబు పేలుళ్ల కేసుపై మంగళవారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.21న ఫిబ్రవరి 2013లో దిల్సుఖ్నగర్ పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిద్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. నిందుల్లో అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.