![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 03:56 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద గురువారం కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ఆహ్వానాలు, వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. మాట్లాడుతూ అనునిత్యం అణగారిన వర్గాల అభివృద్ధికి అండగా ఉంటానని అలాగే నియోజకవర్గంలో స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.