|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 04:01 PM
యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం తెర్యాల గ్రామం,ఆత్మకురు మండల పరిధి రేగులకుంటతో పాటు పలు గ్రామాలలో కురిసిన ఆకాల వర్షాల వల్ల వరి పంటలు,మామిడి,సపోటా తోటలను,కూలిన ఇళ్లను సందర్శించి నష్టపోయిన రైతులను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పరామర్శించారు.నష్టపోయిన రైతులను ఆదుకుంటామని,సంబంధిత అధికారులకు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంటను,తోటలను నష్టం అంచనా వేయాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని భరోసానిచ్చరు.