|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 12:53 PM
లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతోపాటు గత కొంతకాలంగా చాంద్రాయణగుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.చాంద్రాయణ గుట్ట సర్కిల్లో కాంట్రాక్టుకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద శ్రీనివాస్ రూ. 2 లక్షల 20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో తొలివిడతగా రూ. లక్ష 50 వేలు ముట్టచెప్పాడు. మరో రూ. 70వేలు లంచం ఇవ్వాల్సి ఉన్నది. 70 వేలు లంచం డబ్బులు తీసుకొని సదరు కాంట్రాక్టర్ ను శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి మంగళవారం రావాలని శ్రీనివాస్ సూచించాడు. విషయమై ముందుగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సదరు కాంట్రాక్టర్ పిర్యాదు చేశాడు. దీంతో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ అధ్వర్యంలో అక్కడ మాటు వేసి ఉన్నారు. అతని వద్ద నుండి శ్రీనివాస రూ.70 వేలు లంచం డబ్బులు తీసుకుంటుటండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.