|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 03:29 PM
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని బుధవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.