|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 12:48 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీకి షాక్ తగిలింది. అఘోరీకి కోర్టు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. పూజల పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకుని, మోసం చేసిన కేసులో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అఘోరీని మోకిలా పోలీస్ స్టేషన్లో రెండు గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య బృందం పరీక్షలు చేయడంతో అఘోరీని పోలీసులు అక్కడ నుంచి రిమాండ్కు తరలించారు. అయితే జైలుకు వెళ్లినా కూడా తన భార్య తనతోనే ఉంటుందని అఘోరీ తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అఘోరీ అన్నారు. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, నేను జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణి తనతో పాటే ఉంటుందని అఘోరీ అన్నారు.