|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:40 PM
భూ భారతి చట్టం-2025 ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి అని నిర్మల్ రూరల్ తహశీల్దార్ సంతోష్ కుమార్ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లాపల్లిలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం-2025 పై అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో ఆర్ ఐ విజయ్ కుమార్ ఏఈఓ, గ్రామ కార్యదర్శి, రాధా, సవితలు ఉన్నారు.