|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 04:15 PM
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎండ తీవ్రతలు సోమవారం దంచి కొడుతున్నాయి. 38డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతల పట్ల వృద్ధులు చిన్నారులు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. ఇంకా ఎండ తీవ్రతలు నెల రోజులు ఉండే అవకాశం ఉందని తెలియజేశారు.