|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:35 PM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం కంచన్ పల్లి లో శనివారం కోట మైసమ్మ విగ్రహా ప్రతిష్ట మహోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో విరాజిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.