|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:21 PM
రైతుల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం ఉట్కూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులకు వరి, కంది విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలను పాటించాలని, ఆధునిక పంట యాజమాన్య పద్ధతులను అనుసరించాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.