by Suryaa Desk | Fri, Jul 12, 2024, 09:06 PM
హైదరాబాద్ నగరంలో మరోసారి పోలీసు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు.. వారిని ప్రశ్నించారు. ఈ సమయంలో వారిలో ఓ వ్యక్తి వద్ద తనవద్ద గొడ్డలితో పోలీసులపై దాడికి యత్నించగా.. మరొకడు రాళ్లతో దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. వీరిని దోపిడి దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. దొంగలు తమపై దాడికి ప్రయత్నించడంతో పోలీస్ డెకాయ్ టీం కాల్పులు జరిపింది.
పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని ఉత్తర్ ప్రదేశ్కు చెందిన అనీస్, రాజ్గా గుర్తించారు. వీరితో పాటు గ్యాంగుకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరపడంతో వారు పరారయ్యారని పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడ్డవారిని దోపిడి దొంగలుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాంగర్ బస్తీకి చెందిన దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. ఫుట్పాత్పై కూర్చున్న ఉన్న నలుగుర్ని పోలీసులు ప్రశ్నించడంతో దాడికి ప్రయత్నించారు.
కాగా, ఇటీవల నగరంలో దోపిడీ దొంగల ముఠా చోరీలకు పాల్పడుతూ అలజడి సృష్టిస్తోంది. నెల రోజులుగా ఈ గ్యాంగ్ జాతీయ రహదారిపై తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో జులై 4న చిట్యాల వద్ద నల్లగొండ సీసీఎస్ పోలీసులకు బీహార్కు చెందిన పార్దీ గ్యాంగ్ తారసపడింది. పోలీసులను చూసిన ఈ గ్యాంగ్ ఓ వాహనంలో హైదరాబాద్వైపు పరారైంది. సీసీఎస్ పోలీసులు ఆ వాహనాన్ని చేజ్చేసి చివరికి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అటకాయించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దోపిడీ దొంగలు కత్తులతో దాడికి యత్నించారు. దీంతో సీసీఎస్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకోడాని సినిమా స్టయిల్లో పోలీసులు ఛేజింగ్ చేశారు.