by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:38 PM
కుటుంబ కలహాలతో మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు. పట్టణానికి చెందిన పద్మ (36)కు కొన్ని రోజులుగా భర్తతో గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. దీంతో శుక్రవారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.